inter Results | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా ప్రకటించారు. ఫలితాలను మంగళవారమే విడుదల చేయాలని భావించారు. ఓ ఉన్నతాధికారి సెంటిమెంట్గా భావించి మంగళవారం కుదరదని చెప్పినట్టు తెలిసింది. దీంతో బుధవారం ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 28 నుంచే పరీక్షలు ప్రారంభం కాగా, ఇంటర్ ఫస్టియర్లో 4,78,718 మంది, సెకండియర్లో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. సెకండియర్లో మరో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ఫలితాల కొరకు https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. నమస్తే తెలంగాణకు సంబంధించి www.ntnews.com, www.telanganatoday.com వెబ్సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు.