న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ల దిగ్గజం షియోమీ.. తాజాగా మరో బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటిదాక స్మార్ట్ఫోన్లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ప్రపంచంలో దూసుకెళుతున్న షియోమీ తాజాగా విద్యుత్ వాహనాల (ఈవీ) రంగంలోకి ప్రవేశించింది. 1.52 బిలియన్ డాలర్లు (10 బిలియన్ యువాన్లు) పెట్టుబడితో ఈ రంగంలో అడుగు పెట్టనున్నది.
వచ్చే దశాబ్ద కాలంలో మొత్తం 1000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ సీఈవోగానూ షియోమీ సీఈవో లీ జున్ ఉంటారు.
చైనాలోని ఇతర టెక్నాలజీ కంపెనీలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఈవీ మార్కెట్లోకి అడుగుపెడుతుండడంతో షియోమీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
చైనా ఆటోమేకర్ గ్రేట్ వాల్ మోటార్ కోతో షియోమీ చర్చలు జరుపుతున్నట్టు గత వారం వార్తలు వెలువడ్డాయి. అయితే, గ్రేట్ వాల్తో భాగస్వామ్యంపై షియోమీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
మరో ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజం హువావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ ప్రభుత్వ సారథ్యంలోని దేశీయ ఆటోమొబైల్ కంపెనీ చంగన్ ఆటోమొబైల్తోపాటు ఇతర ఈవీ తయారీ కంపెనీలతో సంప్రదిస్తున్నది.
ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ అభివృద్ధిలో చైనా కార్ల తయారీ సంస్థ గీలీ ఆటోమొబైల్ హోల్డింగ్స్తో కలిసి పని చేయనున్నట్టు చైనీస్ సెర్జింజన్ దిగ్గజం బైడు ఇంక్ గత జనవరిలో ప్రకటించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఇంక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !