ఖమ్మం కమాన్బజార్, జూన్ 25: రైతులను ఏం మేలు చేశారు?, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమానికి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయ కుండా రైతు ఆశీర్వాద సభ ఎలా పెడుతారని ప్రశ్నించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను స స్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు నిధులను వరదలా పారించి 2026లోనే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి న సీఎం రేవంత్రెడ్డి.. ఆ తర్వాత ఆ మా టను మర్చిపోయారని విమర్శించారు.