న్యూఢిల్లీ: ఇండోనేషియాలో ఉన్న అగ్నిపర్వతం(Indonesian Volcano) వద్ద ఓ మహిళ ఫోటో దిగబోయి లోయలో పడి మృతిచెందింది. చైనాకు చెందిన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆ టూరిస్టు ప్రదేశానికి వెళ్లింది. ఆమెను హువాంగ్ లిహాంగ్గా గుర్తించారు. సూర్యోదయాన్ని చూసేందుకు ఆ దంపతులు ఓ భారీ కొండను ఎక్కారు. అయితే ఆ అగ్నిపర్వత చివరన నిలుచుకున్న ఆ మహిళ ఫోటో దిగే సమయంలో లోయలో పడిపోయింది. ఇజెన్ అగ్నిపర్వతాన్ని బ్లూ ఫైర్గా పిలుస్తారు. పోలీసుల ప్రకారం ఆ పర్వత కొండపై నుంచి సుమారు 75మీటర్ల కింద ఆ మహిళ పడిపోయింది. కింద పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించారు.