న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు ఉన్నా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర మంగళవారం పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గుముఖం పట్టింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో మంగళవారం ఉదయం 10.58 గంటలకు తులం బంగారం స్వల్పంగా 0.72 శాతం (రూ.314) పెరిగి రూ.43,859కి పెరిగింది. ఇంతకు ముందు ట్రేడింగ్లో రూ.43,545 వద్ద ముగిసింది. మే ఫ్యూచర్స్లో కిలో వెండి ధర రూ.323 తగ్గి రూ.63,851 వద్ద స్థిరపడింది. గత ట్రేడింగ్లో కిలో వెండి ధర రూ. 64,174 వద్ద స్థిర పడింది.
అమెరికా ఎకానమీ బలోపేతం అవుతుందన్న అంచనాల మధ్య.. అమెరికా ట్రెజరీ బాండ్లు పెరిగిపోవడంతోపాటు డాలర్ విలువ బలోపేతం కావడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.45 శాతం తగ్గి 1706 డాలర్లకు పడిపోగా, వెండి 0.78 శాతం పడిపోయి 23,583 డాలర్లకు పరిమితమైంది.
ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతోపాటు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు రికవరీ దిశగా పయనిస్తుండటంతో బంగారం, వెండి ధరలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికీ బంగారం ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా ఉన్నప్పటికీ సెన్సెటివ్ అమెరికా ప్రభుత్వ బాండ్లు పుంజుకోవడంతో మదుపర్లు పసిడిపై ఆసక్తి చూపడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !