CM KCR | ఓటును ఆషామాషీగా వేయొద్దని.. అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కోరారు. సభలో సీఎం ‘మాట్లాడుతూ.. మీ అందరినీ నేను కోరేది ఒకటి. ఏదైనా ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే.. నేను చెప్పే నాలుగు మాటలను మీ ఊళ్లకు వెళ్లిన తర్వాత నిజానిజాలు తేల్చాలి. అప్పుడు ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. 30న ఓట్లు పడుతయ్. 3న ఓట్లు లెక్కిస్తరు.. అక్కడికి దుకాణం అయిపోతుందని మీరు అనుకుంటరు. కానీ అక్కడికే అయిపోతు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటది. ఎవరైతే నాయకులు నిలబడ్డరో వీళ్ల వెనుక చాలా పెద్ద పార్టీలున్నాయ్. అభ్యర్థి కమిట్మెంట్, వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలి. వారికి అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారనే విషయాలను గమనించాలి. ప్రజాస్వామ్యం పరిణితి అంటేనే ఇదే’నన్నారు.
‘మనల్ని కరువు గురి చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా? కృష్ణా, గోదావరి రెండు నదులు ఈ రాష్ట్రం నుంచి పారుతుంటే గుక్కెడు నీళ్లియ్యక.. మంచినీళ్లకు, సాగునీటికి సావగొట్టి చావగెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చిన నాడు కరెంటు లేదు. చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్లు ఒక్కొక్కటి చేసుకుంటూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది. మీ అందరికీ మనవి చేస్తున్నా. గతంలో కరెంటు లేకుంటే. ఈ రోజు ఎందుకు ఉన్నది? ఎవరి వల్ల ఉన్నదో ఆలోచన చేయాలి. ఓటు ఆషామాషీగా వేయొద్దు. అంత ఈజీ కాదు. మీ సంవత్సరాల భవిష్యత్ను నిర్ణయిస్తుంది. చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. ఒకటి ఒకటి ఎలా చేసుకుంటు వచ్చామో మీ ముందున్నది’ అన్నారు.
‘గోదావరి, పాకాల 60 సంవత్సరాల డిమాండ్. ఒక్క సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజం కాదా? మీరు ఆలోచన చేయాలి. గతంలో యాసంగిలో ఎంత పంట పండేది? 30-35వేల ఎకరాలు పారేది కాదు. ఇవాళ 1.30లక్షల ఎకరాలు యాసంగిలో నర్సంపేటలో పంటలు పడుతున్నయ్. ఇది సుదర్శన్రెడ్డి చేసిన పుణ్యమే. మీద ప్రభుత్వం ఉన్నా పట్టించుకునే ఎమ్మెల్యే ఉంటే అయితది.. లేకపోతే కాదు. సుదర్శన్ రెడ్డి కన్నా ముందు ఎంత మంది ఎమ్మెల్యేలు నర్సంపేటకు కాలేదు. పెద్దపెద్ద సిపాయిలున్నరు. వారంతా చేయలేకపోరు కానీ, సుదర్శన్రెడ్డే ఈ రోజు పాకాల కింద ఆయకట్టు కింద ఢోకా లేకుండా చేసింది అవునా కాదా? ఆలోచన చేయాలి. కృష్ణా, గోదావరి రెండు నదుల మధ్య ఉండే తెలంగాణ మంచినీళ్లకు ఎందుకు బాధపడ్డాం ? మేం అధికారంలోకి వచ్చా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చాం. మిషన్ భగీరథ మొదలుపెడితే క్లియర్గా చెప్పాను. ఐదేళ్లలో కంప్లీట్ చేసి మీకు నీళ్లందివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలవడదు.. ఓట్లు అడగమని చెప్పాం’ అంటూ గుర్తు చేశారు.
‘రెండు నదులు ఉండగా గత ముఖ్యమంత్రులు మంచినీళ్లు ఎందుకివ్వలేదు. భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి, ప్రతి లంబాడి తండాకు.. నల్లా పెట్టి నీరిచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో గంగానది ఉంటది. ఆ రాష్ట్ర ముఖ్యమంతి లుంగీ వేసుకొని ఊపుకుంటూ ప్రచారం చేయడానికి మన వద్దకు వస్తడు. గంగా నది ఉండే ఉత్తరప్రదేశ్లో కూడా ఇవాళ్టికి కూడా మంచినీళ్లకు దిక్కులేదు. అనేక నదులుండే రాష్ట్రాల్లోనూ నీళ్లు రావడం లేదు. కమిట్మెంట్ ఉంటే.. చేయాలనే పట్టుదల ఉంటే.. ఆడబిడ్డల భుజాలు కాయలు కావొద్దంటూ నీళ్లు వస్తయ్ లేకపోతే రావ్. బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది కాబట్టి.. ఎమ్మెల్యే ఎక్కడికక్కడ పని చేయడంతో నీళ్లు వచ్చాయి. గతంలో కరెంటు లేక ఇబ్బందులుపడ్డాం. ఎన్నో అవస్థలు పడ్డాయి. ఇవాళ కరెంటు పరిస్థితి ఎలా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదు. ఒక్క తెలంగాణలోనే ఉన్నది’ అని చెప్పారు.