Vizag Steel Plant | సూర్యాపేట : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్ర మంత్రి(Union Minister) ప్రకటించడం ముమ్మాటికి బీఆర్ఎస్(BRS) విజయమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేట(Suryapeta) నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలతో అధికారులు విశాఖ ప్లాంట్ బిడ్డింగ్ వేయడానికి వెళ్లగా నరేంద్రమోదీ(Narendra Modi) ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Privatization)పై కేంద్రం వెనుకడుగు వేసిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రజలను నమ్మించడానికి వెనక్కితగ్గిందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. విశాఖ స్టీల్పై తమ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించిన తరువాత ఏపీలోని పార్టీలకు వణుకు మొదలైందని అన్నారు.
కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీల వ్యతిరేకత నుంచి బయట పడేందుకు కేంద్రం ఎత్తుగడ వేసిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ను ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీ మంత్రుల వ్యాఖ్యలు అపరిపక్వతగా ఉన్నాయని విమర్శించారు.