కరీంనగర్: బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ, ఐటీ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని బీఆర్ఎస్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదని విమర్శించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని చెప్పారు. కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగునీరు, కరెంటు కోసం రైతులు కాంగ్రెస్పై తిరగబడుతున్నారన్నారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అందుకే తెలంగాణలో నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు జాతీయ రహదారుల కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
జై తెలంగాణ నినాదాన్ని రూపుమాపే కుట్ర జరుగుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం తప్ప బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. మార్పు అంటే కాంగ్రెస్ పాలనలో మూడు రోజులకొకసారి తాగునీరు వస్తుందని చెప్పారు. వినోద్ కుమార్ను భారీ మెజార్జీతో గెలిపించాలన్నారు.