కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : రేవంత్రెడ్డి సీఎం అనే హోదాను మరచి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్లోని 30,32,38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుచేయలేక రేవంత్రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై బురదజల్లుతూ పొద్దుగడుపుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఇలాంటి దికుమాలిన సీఎంను ఎకడా చూడలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాటిని అమలుచేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు.