వరంగల్ అర్బన్ : అవకాశవాద రాజయకీయాలకు పాల్పడ్డ ఈటల రాజేందర్పై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోదక్ కుమార్ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో ఆశ పడటం సహజమేనని కానీ సీఎం పదవిపై ఈటల అత్యాశ పడ్డారని ధ్వజమెత్తారు. ఆదివారం హన్మకొండలోని తన నివాసంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల దళిత నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజకీయంగా ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ అధినేతగా, సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలను ఈటల తన స్వార్థానికి వాడుకున్నారని వినోద్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి కూడా ఈటల ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేశారని, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఎంతో సహనాన్ని పాటించి రాజేందర్ చర్యలను ఓపిగ్గా భరించారని ఆయన తెలిపారు. చివరికి టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే చర్యలకు ఈటల పాల్పడటంతో తదుపరి పరిణామాలు తప్పలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తిన్న ఇంటి వాసాలను లెక్కించే ఈటల రాజేందర్ వంటి నాయకుల చర్యలను ఎవరూ భరించలేరు అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. కేవలం ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి ఈటల రాజేందర్ విషయంలో సరిగ్గా సరిపోతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్ చిన్నారులు