రాజన్న సిరిసిల్ల : కాపర్ డ్యామ్ కట్టకపోవడం వల్లే 5వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి( CM Revanth Reddy) పాలనా వైఫల్యమే కారణమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్(Vinod Kumar) ఆరోపించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు రెఫరండెంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
కానీ, గ్రామాల్లో సాగు నీటి )Cultivation water)గోసను రైతులు ఏకరువు పెడుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రైతులు నీళ్ల కోసం, రూ.5 వందల బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఉచిత బస్సు పథకం తప్పా ఏ పథకం అమలు చేయడం లేదని విమర్శించారు. ఉచిత (సబ్సిడీ )సిలిండర్ పథకం ఉద్దెర పథకం అయిందని మండిపడ్డారు. వినియోగ దారులు రూ. 975 కట్టాల్సిన నిబందనే ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.