హనుమకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరోమారు తన ఉదారతను చాటారు. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న టీచర్స్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి టూ వీలర్పై వెళ్తూ హనుమకొండ కలెక్టరేట్ ముందు బండి స్కిడ్ అయిపడిపోయాడు. అటువైపు నుంచి కాజీపేట ప్యారాడైజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి వెళ్తున్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పడిపోయిన వ్యక్తిని చూసి చలించి పోయారు.
మార్గం మధ్యలో తన వాహనాన్ని ఆపి పడిపోయిన వ్యక్తిని లేపి గాయలను పరిశీలించారు. వెంటనే రోహిణి హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడారు. ఒక వాహనాన్ని ఇచ్చి పోలీసుల సహాయంతో హస్పిటల్కు పంపించారు. ఎమ్మెల్యే చొరవ పై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
Medaram | ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్రావు
చప్పట్లతో కరెంట్ మోటర్ ఆన్, ఆఫ్..నాగర్కర్నూల్ యువకుడి ప్రతిభ