హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవలి పల్లె పల్లె ప్రగతితోపాటు, ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయా పనులకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.
కొత్త సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్త్రీ నిధి రుణాల ద్వారా ఇంటింటికి సోలార్ ప్రాజెక్టు, జిల్లాకు వెయ్యి మంది మహిళా లబ్ధిదారులను ఎంపిక చేయాన్నారు.
ప్రయోగాత్మకంగా మహిళా గ్రూపులకు కుట్టు శిక్షణ, డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిక్ కార్ట్తో అమ్మకానికి ఒప్పందం, స్త్రీ నిధి వేతన పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, డిప్యూటీ కమిషనర్లు, పంచాయతీరాజ్ ఈఎన్సీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.