పరిగి : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం తరపున కిలో బంగారం అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. కిలో బంగారానికి సంబంధించిన డబ్బులు త్వరలోనే యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ అధికారులకు అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.