వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandrasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి తన రాజీనామా లేఖ (Resignation)ను పంపారు. బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారులు భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. పార్టీలో పనిచేవారిని ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్.. గత కొన్నిరోలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా ఐదుసార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనకు మరోసారి ఓటమే ఎదురైంది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీని వీడారు.