చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు
చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ) విద్యుత్ మెయిన్ లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ఇనుప రాడ్లతో తయారు చేసే మెయిన్ లైన్ స్తంబాలను కార్మికులు ఏర్పాటు చేస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా సాగర్ నుంచి శ్రీశైలం వరకు మెయిన్ లైన్ స్తంబాలను కలుపుతున్నారు. గతంలో ఉన్న విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారణకు మెయిన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా అధికంగా అవసరం ఉన్నందున అవసరానికి సరి పడా లోటును పూడ్చేందుకు మెయిన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఆయా మండలాల్లో ఒకే మెయిన్ లైన్ ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా మెయిన్ లైన్ ఏర్పాటు చేస్తే రైతులకు, గ్రామాలకు, ఫ్యాక్టరీలకు, ప్రాజెక్టులకు సరిపడా విద్యుత్ సరఫరా అం దించేందుకు మెయిన్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఒక్కో స్తంబం ఏర్పాటుకు వారం రోజుల సమయం పడుతుంది. జార్ఖండ్, రాజస్థాన్, బిహార్ రాష్ర్టాల నుంచి కార్మికు లు వచ్చి పనులు చేపడుతున్నారు. చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా ఏర్పాటు చేస్తున్న మెయిన్లైన్ను సుమారు 150 ఇనుపరాడ్ల స్తంబా లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ నుంచి సాగర్ వరకు ఏర్పాటు చేసి అదే మెయిన్ లైన్ను దామర చర్ల విద్యుత్ థర్మ ల్ ప్లాంట్ వద్ద కనెక్షన్ ఇచ్చే విధంగా ఈ మెయిన్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇక నుంచి విద్యుత్ కొరత తీరనుంది. మెయిన్ లైన్ ఏర్పాటు చేస్తుండటంతో ఆయా మండలాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.