హైదరాబాద్ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ భార్య కనకదుర్గ(63) కన్నుమూసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కనకదుర్గ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కనకదుర్గ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇవికూడా చదవండి..