వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమ శంకర్ శర్మ ఆరోగ్యంగా ఉన్నారు. 15 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే భీమ శంకర్ శర్మ చనిపోయారంటూ వాట్సాప్లో గుర్తు తెలియని వ్యక్తులు వదంతులు సృష్టించారు. ఈ వదంతులపై భీమ శంకర్ శర్మ స్వయంగా స్పందించారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలోనే విధుల్లో చేరుతానని, భక్తులేవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..