భీమ్గల్, ఫిబ్రవరి 9 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెప్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి బాటలోనే పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ కూడాఅబద్ధాలు చెప్తూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులంతా ఇక్కడికి దండుపాళ్యం బ్యాచ్లా వచ్చి నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముగ్గురు, నలుగురు చైర్మన్లు ఇక్కడే తిష్టవేసి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా వచ్చాడని, అందరూ ప్రభుత్వ వాహనాలు పెట్టుకుని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఆరోపించారు.