VC Sajjanar | స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేశారు. నేరగాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను కిడ్నాపర్లు చంపేస్తారంటూ భయభ్రాంతులకు చేస్తున్నారన్నారు. తాజా హైదరాబాద్ రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబర్తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. తాను పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నానని.. కాలేజీకి వెళ్లిన అమ్మాయి కిడ్నాప్నకు గురైంది. ఆమె ప్రస్తుతం మాదగ్గరే ఉందని.. వెంటనే మేం అడిగినంత డబ్బును ఆన్లైన్ ద్వారా పంపించాలని.. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాపర్లు చంపేస్తామని బెదిరించారని.. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్ని వినిపించారన్నారు.
ఏడుస్తున్న గొంతు వినిపించడంతో కాలేజీకి వెళ్లిన తమ కూతురు కిడ్నాప్నకు గురైందని తల్లిదండ్రులు భావించారని.. డబ్బులు పంపించేందుకు సిద్ధపడ్డారన్నారు. మోసగాళ్లతో ఫోన్లో మాట్లాడుతూనే తమ బంధువులకు ఈ విషయాన్ని చేరశారని.. తమ కూతురు కాలేజీలో ఉందో.. లేదో తెలుసుకోవాలని కోరారని పంపారన్నారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉందని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారన్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారని.. అనంతరం నా దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని.. ఆడ పిల్లలను కిడ్నాప్ చేశారని చెప్పగానే నమ్మి వారికి డబ్బులు పంపిస్తున్నారని.. అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్కు స్పందించొద్దని.. బెదిరింపులకు జంకకుండా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు.
ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్రత్త!!
స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను కిడ్నాపర్లు… pic.twitter.com/IqPAozDTXG
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 11, 2024