యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 17: దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీ టీచర్లకు గుర్తింపునిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి అన్నారు. రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మొక్కు లు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వరలక్ష్మి మాట్లాడుతూ.. మినీ అంగన్వాడీల కష్టాలను గుర్తించి మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, అధికారులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు వెల్లడించారు.