ధర్మపురి : ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వారా మంత్రి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లక్ష్మీనరసింహస్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత-సురేశ్ దంపతులు, జిల్లా కలెక్టర్ రవి దంపతులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు.