హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబసభ్యులతో సహా బీఆర్ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖర్రావును కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సందర్భంగా రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు కుటుంబసభ్యులతో కలిసి శనివారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛమిచ్చి, శాలువాతో సతరించారు.
ఎంపీ దంపతులతో పాటు వారి కూతురు, అల్లుడు డాక్టర్ గంగుల గంగాభవాని, సందీప్, తనయుడు వద్దిరాజు నాగరాజు, మనవళ్లు గంగుల సనవ్, గంగుల సౌరవ్లు కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు.