హైదరాబాద్ : జంటనగరాలు, శివారు ప్రాంతాల డెవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి ఉప్పల్ భగాయత్ ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ నెల 27న(శనివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బేగంపేట్లోని టూరిజం ప్లాజాలో ఈ ప్రీ బిడ్ సమావేశం జరగనుంది.
వివిధ కేటగిరిలకు సంబంధించిన 44 ప్లాట్లు ఉప్పల్ భగాయత్ వెంచర్లో అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో 150 గజాల స్థలం నుంచి 5 వేలకు పైగా గజాల స్థలాల ప్లాట్లు ఉప్పల్ భగాయత్ వెంచర్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2, 3వ తేదీల్లో ఈ-అక్షన్ జరగనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు, వారి ప్రతినిధులు ప్రిబిడ్ సమావేశానికి హాజరుకావాలని హెచ్ఎండిఏ పిలుపునిచ్చింది.