హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా చెప్పుకొనే రాహుల్ కుమార్ శర్మ భారీగా మందులు నిల్వ చేసినట్టు అందిన సమాచారం మేరకు దాడులు చేశామని డీసీఏ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
27 రకాల ఔషధాలను స్వా ధీనం చేసుకొన్నామని, వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని చెప్పా రు. వీటితోపాటు వరంగల్ జిల్లా పరిధి ఖిలా వరంగల్లోని ఓ క్లినిక్లో అక్రమంగా నిల్వ చేసిన 40 రకాల మందులను స్వాధీనం చేసుకొన్నామని, వీటి విలువ రూ.80 వేల వరకు ఉంటుందని తెలిపారు. టీ రాజేందర్ అనే వ్యక్తి లైసెన్స్, సర్టిఫికెట్ లేకుండా ఈ క్లినిక్ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.