హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఎక్కడ? అని ప్రశ్నించారు. మహిళలకు ఆర్థిక సాయం, కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు, పెండ్లి కానుకగా తులం బంగారం, బీసీలకు నిధులు, రైతుభరోసా, కౌలు రైతులకు సాయం, పంటలకు బోనస్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. గ్యారెంటీల విషయంలో ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.