రాష్ర్టానికి వచ్చినప్పుడల్లా నోటికొచ్చినదంతా మాట్లాడిపోయే అమిత్షా ఈసారి ఆదిలాబాద్ వేదికగా మళ్లీ అబద్ధాలను వల్లెవేశారు. ఆయన ప్రసంగం అంతా అసత్యాలు, భ్రమలతోనే సాగింది. రైతు ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటివాటిపై తన అవగాహన రాహిత్యాన్ని అమిత్షా ప్రజలముందు బయటపెట్టుకున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్లో చేసిన ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, భ్రమలతో నిండిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అనేక అం శాలపై తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ పేరు చెప్తేనే కర్ణాటక, మధ్యప్రదేశ్ వం టి రాష్ర్టాల్లో వెలుగుచూసిన ఘోరాలు గుర్తుకు తెచ్చుకొని దేశ ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో డబుల్ ఇంజిన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టడమే కాకుండా తాము గెలిస్తే మోదీ పాలన తెస్తామని చెప్పడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్కు తాకట్టు పెడతామని షా చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
సీఎం కేసీఆర్ గిరిజనులను పట్టించుకోలేదని షా వ్యాఖ్యానించడంపై గిరిజనులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1,51,146 మంది పోడు రైతులకు 4,06,369 ఎకరాల మేర పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలియదా? అని నిలదీస్తున్నారు. అమిత్షా సభ జరిగిన ఆదిలాబాద్ జిల్లాలోనే 12,222 మంది రైతులకు 31,683 ఎకరాల మేర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. గోండు వీరుడు, కుమ్రంభీం పుట్టిన ఆసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ స్వయంగా పట్టాల పంపిణీని ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. ఇదికూడా తెలియకపోవడం అమిత్ షా అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
ఎన్నికలు రాగానే రాజకీయాలకు మతం రంగు పులుముతారని అందరూ ఊహించినట్టే అమిత్ షా అయోధ్య, రామమందిరం అంటూ వ్యాఖ్యానించారు. ప్రజల విరాళాలతో కడుతున్న రామమందిరాన్ని తామే కడుతున్నట్టు బీజేపీ బిల్డప్ ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గంగ జమున తెహజీబ్ సంస్కృతి కొనసాగుతున్నదని చెప్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస చెలరేగితే తెలంగాణలో శాంతియుతంగా పండుగ జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఇటీవల వినాయక నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ ఉండగా, ముస్లింలు ఊరేగింపును వాయిదా వేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా రు. నిజమైన లౌకిక వాదం అంటే ఇదేనని పేర్కొంటున్నారు. రజాకార్లు, నిజాం, ఎంఐఎం అంటూ పాత వ్యాఖ్యలే చేయడంపై మండిపడుతున్నారు. మణిపూర్లో జాతుల మధ్య మంటలు, హర్యానాలో మతఘర్షణలు అడ్డుకోలేని అమిత్ షా.. రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడుతామని చెప్పుకోవడం సిగ్గుచేటని దుమ్మెత్తి పోస్తున్నారు.
గిరిజన వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వ డం లేదని అమిత్ షా ఆరోపించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే వర్సిటీ ఏర్పాటుకు రెం డు చోట్ల భూములను ప్రతిపాదించింది. 2017లో కేంద్ర బృందం పర్యటించింది. 2018లోనే ములుగు జిల్లాలో 335 ఎకరాలను కేటాయించింది. అయినా కేంద్రం నాన్చుడు ధోరణి ప్రదర్శించింది. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం గిరిజన వర్సిటీని ప్రకటించి, గొప్పగా చెప్పుకోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. 2016లోనే వర్సిటీ పెట్టి ఉంటే ఎంతో మంది గిరిజన బిడ్డల జీవితాలు బాగుపడేవన్నారు. కృష్ణా జలాల పంపిణీకి సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పడం సిగ్గుచేటని అమిత్షాపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని కేసీఆర్ కొట్లాడుతున్నారన్నారు. ఇన్నాళ్లూ వాటా తేల్చకుండా, ప్రాజెక్టులకు అడ్డం పడి, తెలంగాణకు అన్యాయం చేసిన కేం ద్రం ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రకటనను ప్రజలు పట్టించుకోరని స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని మంజూరు చేయాల్సింది కేంద్రమా? రాష్ట్రమా? అని నిలదీస్తున్నారు.
పదే పదే కుటుంబ పాలన అంటూ విమర్శించడంపైనా ప్రజలు మండిపడుతున్నారు. అమిత్ షా కొడుకు జైషాకు బీసీసీఐలో పదవి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 1.10 కోట్ల కుటుంబాలకు తాగునీరు ఇస్తున్నామని అమిత్ షా చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం జల్ జీవన్ మిషన్ను ప్రారంభించే నాటికే తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథను పూర్తిచేసి, ప్రతి ఇంటికీ తాగునీటిని అందించిన విషయాన్ని, ఈ పథకాన్ని కేంద్రం కాపీకొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నామన్న అమిత్ షా వ్యాఖ్యలను చూసి రైతులు నవ్వుతున్నారు. రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని కాపీకొట్టి అమలు చేస్తున్న విషయాన్ని మర్చిపోయారా? అని నిలదీస్తున్నారు.
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదన్న అమిత్ షా వ్యాఖ్యలపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఫిబ్రవరి 7న లోక్సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉన్నది. 2021లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర లో 2,640 మంది, కర్ణాటకలో 1170 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తోమర్ పేర్కొన్నారు. 2021లో ఆ రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ డబు ల్ ఇంజిన్ సర్కారే ఉన్నది. ఈ విషయాన్ని దాచిపెట్టి తెలంగాణను బదనాం చేయడంపై రైతులు మండిపడుతున్నారు.
‘గిరిజన భూములకు పోడు పట్టాలు ఇస్తే బీఆర్ఎస్కు ఓటేయండి, గిరిజన రిజర్వేషన్ను పెంచితే బీఆర్ఎస్కు ఓటేయండి’ అని ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూన్లో 1,51,146 మంది పోడు రైతులకు 4,06,369 ఎకరాల మేర పట్టాలు పంపిణీ చేశారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 12,222 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరింది. గిరిజన రిజర్వేషన్ను రాష్ట్రంలో 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. కాబట్టి బండి సంజయ్ చెప్పినట్టు బీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.