షాబాద్, జనవరి 5: తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమం చాలా బాగున్నదని కేంద్ర అధికారుల బృందం కితాబిచ్చింది. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కక్కులూర్, సర్దార్నగర్, కేశారం గ్రామాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రొఫెసర్ జ్యోతిష్ సత్యఫలాథ్, ఢిల్లీ చీఫ్ సలహాదారు ప్రవీణ్ మహత్ తదితరులు పర్యటించారు.
వీరి వెంట స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు. వారు ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ, పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి పనులు రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి? అన్నది తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటించినట్టు పేర్కొన్నారు.