పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి సమీపంలో సుమారు 35 సంవత్సరాల వయసు ఉండే గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలుకి పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు.
మృతుడిని గుర్తించడానికి ఆధారాలు ఏమీ లేవన్నారు. అతడి వద్ద పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లే టీఎస్ అర్టీసీ టికెట్ లభ్యమైందన్నారు. మృతదేహం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో ఉందన్నారు. వివరాలకై 9949304574, 9440700039 సంప్రదించాలని కోరారు.