పెద్దపల్లి : ఏ కన్నతల్లి బిడ్డో పాపం.. జోలపాట వింటూ తల్లి వెచ్చని ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి రైల్వే పట్టాలపై( Railway track) పడి ఉంది. నవ మాసాలు మోసి కన్న తల్లికి ఎలాంటి కష్టమొచ్చిందో లేదా వదిలించుకోవాలనుకుందో తెలియదు కానీ అభం శుభం తెలియని చిన్నారని(Unidentified baby) అనాథను చేసి వెళ్లారు. ఈ హృదయవిదారకర సంఘటన పలువురిని కలిచివేసింది. ఈ అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని ఎల్సీ గేట్ సమీపంలో రైల్వే ట్రాక్ మధ్య గుర్తు తెలియని రెండు నెలల బాబును ఎవరో వదిలిపెట్టి వెళ్లారు.
సమాచారం అందుకున్న రామగుండం రైల్వే సీఐ బి.సురేష్ గౌడ్, ఎస్ఐబీ. క్రాంతి కుమార్, కానిస్టేబుల్ సుమన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ
KTR | నా మాటలు రాసిపెట్టుకోండి.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపులపై కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్!
BRS | కేటీఆర్పై ఈ అక్రమ కేసులు ఎందుకో తెలుసా?