మంచిర్యాల : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గుండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar )అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట, వేంపల్లి గ్రామ సరిహద్దులో సుమారు 276 ఎకరాలలో ఏర్పాటు చేయబో యే ఇండస్ట్రియల్ పార్కు(Industrial Park) నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను పరామ ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూముల ను ఎలాంటి నోటిఫికేషన్లు, జీవోలు లేకుండా గుంజుకుంటున్నారని ఆరోపించారు.
మంచిర్యాలలో మీడియాపై బహిరంగంగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బెదిరింపులకు పాల్పడు తున్నాడు. కాంగ్రెస్ నాయకుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని సవాల్ విసిరారు. పేద దళిత వర్గాలకు చెందిన రైతుల భూముల్లో ఎలా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తారని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ఎస్సీలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దళితుల భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని, బాధితుల వెంట కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, స్థానిక నేతలు ఉన్నారు.