జగిత్యాల : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రారంభించిన పోస్టుకార్డుల ఉద్యమానికి అనూహ్య స్పందన వస్తుంది. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులను పంపాలని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కార్డులను రాస్తున్నారు.
దీంట్లో భాగంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణిప్రవీణ్, వైస్చైర్మన్ గోలి శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు బొడ్ల జగదీశ్ మోదీకి పోస్టుకార్డులు రాశారు. వీరితో పాటు కౌన్సిలర్లు తోట మల్లికార్జున్,ముస్కు నారాయణ రెడ్డి, కోరే గంగమల్లు,అల్లే గంగాసాగర్, కూతురు రాజేశ్, పిట్టా ధర్మరాజ్, నాయకులు బలే శంకర్,సుల్తాన్ ఉద్దీన్ అహ్మద్, బద్ధం జగన్,నాయకులు కార్డులు రాసిన వారిలో ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొట్ల వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు చేనేత వస్త్రాల పై జీఎస్టీ రద్దు చేయాలని పోస్టుకార్డులను రాశారు. బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం గ్రామ అధ్యక్షులు బోట్ల మల్లేషం, మండల కన్వీనర్ కూరపాటి శ్రీనివాస్ , చేనేత పవార్ లూమ్ కార్మికులు మోర బుచ్చి రాములు బోట్ల శంకరయ్య బోట్ల సత్యనారాయణ బోట్ల మల్లేశం సింగిల్ విండో సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు .