హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగలంతా కలిసి రణభేరి మోగించనున్నా రు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో భారీ నిరుద్యోగ రణభేరి నిర్వహించనున్నారు. నేడు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో లక్షలాదిమందితో మహానిరసనకు పిలుపు ఇచ్చా రు.
ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఎం నేతలు కూడా మద్దతు ఇవ్వడంతోపాటు ప్రత్యక్షంగా ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం పోలీసులను అప్రమత్తం చే సింది. సీపీఎం శ్రేణులతోపాటు నిరుద్యోగులు భారీగా ధర్నాకు హాజరవుతున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పోలీసులను భారీగా మోహరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది.