హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలకు(Congress leaders) ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఇచ్చిన హామీలపై(Six Guarantees) ఎక్కడికక్కడ నిలిదీస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు ఉక్కికిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి (Undavalli) మండలంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు ఉపాధి హామీ కూలీలు(Laborers) పట్టపగలే చుక్కలు చూపించారు.
ఎన్నికల్లో మాకు ఇచ్చిన 6 గ్యారింటీలు సంగతేంటి? ప్రతీ మహిళకు రూ.2500ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు బతుకు జీవుడా అనుకుంటా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురవుతున్నది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా సబ్బండ వర్ణాల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను నిలదీసిన ప్రజలు
జోగులాంబ గద్వాల – ఉండవల్లి మండలంలో మాకు ఇచ్చిన 6 గ్యారింటీలు సంగతేంటి? ప్రతీ మహిళకు 2500/- ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ నాయకులను నిలదీసిన ప్రజలు.
సమాధానం చెప్పలేక అక్కడి నుండి వెళ్లిపోయిన కాంగ్రెస్ నాయకులు pic.twitter.com/94fCazPSBm
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2024