వీణవంక, సెప్టెంబర్ 29: బీజేపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొంగోని కార్తీక్ గౌడ్ (22) ప్రచారం చేస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే ఆ వివాహితతో అతడికే సంబంధం ఉన్నదని అందరికీ చెప్తామని గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు చిట్టిరెడ్డి కొండాల్రెడ్డి, అల్లపురెడ్డి దేవేందర్రెడ్డి (ప్రస్తుత ఉప సర్పంచ్) కార్తీక్ను బెదిరించారు.
10 రోజులుగా రాత్రివేళ వారి ఇండ్లళ్లకు పిలిపించుకొని బెదిరింపులకు గురిచేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ గురువారం తాను చనిపోతున్నానంటూ తన చెల్లెలికి వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ స భ్యులు కార్తీక్ను జమ్మికుంటలోని ప్రైవే ట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.