వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల్ మండలం మామునూరు శివారులో వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు వరంగల్ శివనగర్, కాశిబుగ్గకు చెందిన పోలేపాక వినయ్(27), చిన్నపల్లి ప్రదీప్(17) గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.