హైదరాబాద్ : సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయా లయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా తొగుట(Thoguta) శివారులో శుక్రవారం ఓ లారీ బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్, ప్రసన్న కుమార్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి(Severely injured). స్థానికులు గాయపడిన యువకుడిని సిద్దిపేట ఏరియా హాస్పిట ల్కు తరలించారు. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందు కున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.