మెదక్ : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా
పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిచెలిమె నాగరాజు (20) పోతుల శ్రీనివాస్(21) తోపాటు కిష్టయ్య ముగ్గురు కలిసి చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు.
కాగా, ప్రమాదవశాత్తు నాగరాజు, శ్రీనివాస్ నీటిలో మునిగి మృతి చెందగా కిష్టయ్య ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. నాగరాజు, శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.