నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పువ్వుల కోసం చెరువులో దిగి ఇద్దరు యువకులు మృతి (Two youths died) చెందారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లిలో (Kummanpally) ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు సాలూర గ్రామానికి చెందిన ఇద్దరు యవకులు, గాజు మనోజ్, గోరంట్ల మనోజ్ పువ్వుల కోసం కుమ్మన్పల్లి చెరువులోకి(Pond ) దిగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.
గమనించిన స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను బోధన్ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.