మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రాకేష్(17) అలావత్ కిషన్(16) సంగారెడ్డి జిల్లా హత్నూరలోని ఐటిఐ కాలేజీలో చదువుతున్నారు.
కాగా,ఆదివారం కావడంతో ఇద్దరు కలిసి మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలోకి ఈత కోసం వెళ్లి మృతి చెందారు. అప్పటి దాకా తమతో సరదాగా గడిపిన పిల్లలు అంతలోనే విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.