జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ్రిడ్జిపై ఉదయం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే.. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో గూడ్స్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో రోడ్డున పక్కన నిలిపి టైర్ మారుస్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీ కొట్టడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.