నారాయణపేట : జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన భాషా (50), షికూర్ (50), వెంకట్రావు గా గుర్తించారు. ముగ్గురు కలిసి కారులో గోవా వెళ్లారు. తిరిగి వస్తుండగా మక్తల్ మండలం, గుడిగండ్ల గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక భాగంలో ఢీ కొట్టి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది.
ఈ విషయము గమనించని లారీ డ్రైవర్ లారీని అర కిలోమీటర్లు పైగా ప్రమాదానికి గురైన కారుతో పాటు లారీ వెళుతుండడం చూసిన కొంతమంది లారీని ఓవర్టేక్ చేసి విషయాన్ని డ్రైవర్ కు చెప్పారు. లారీని పక్కకు ఆపి ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ భయంతో పరారయ్యాడు.
విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు మృతి చెంది ఉండగా, వెంకట్రావు తీవ్రంగా గాయపడగా.. డ్రైవర్ ప్రశాంత్ కు సీటు బెల్టు ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్రావును మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించారు.