హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో(Zaheerabad) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీ, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం(Died) చెందారు. రాంనగర్ ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదంలో రెహాన్, నాదిల్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.