సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో(Suryapet district) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటు చేసు కుంది. చెట్టుకు కారు(Car) ఢీ కొని ఇద్దరు మృతి(Died) చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రాయిని గూడెం వద్ద గురువారం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి(17), నవీన్(20) అక్కడికక్కడే మృతి చెందారు.
క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.