హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో(Pond) చేపల వేటకు(Fishing) వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత(Two people died) పడ్డారు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా కొత్తూరు మండలం మక్తగూడలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిష్టయ్య, వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టేందుకు చెరువద్దకు వెళ్లారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కిష్టయ్య, వెంకటేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.