మనోహరాబాద్, ఫిబ్రవరి 07 : మెదక్(Medak) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు( fishing) వెళ్లి ఇద్దరు మృత్యువాత(Died) పడిన సంఘటన జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామానికి చెందిన బుర్రి యాదయ్య (58), మహ్మద్ యాసిన్ఖాన్ (60) గ్రామంలోని కుడి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు.
చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరించారు.