ములుగు : ములుగు జిల్లాలో( Mulugu) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైకు చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి(Died) చెందారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట-లక్ష్మీపురం వద్ద జరిగింది. మండలంలోని తిమ్మాపూర్కు చెందిన ఉమ్మడి ఉమేష్ (22), లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (22) బైక్పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో లక్ష్మీపురం వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.