హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మరో రెండు దగ్గు సిరప్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రీలైఫ్ (బ్యాచ్ నంబర్ ఎల్ఎస్ఎల్ 25160, తయారీ సంస్థ: షేప్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, గుజరాత్), రెస్పీఫ్రెష్-టీఆర్ (బ్యాచ్ నంబర్ ఆర్01జీఎల్ 2523, తయారీ సంస్థ: రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్) దగ్గు సిరప్లను ప్రజలు వాడొద్దని సూచించింది.
ఈ మేరకు బుధవారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ షెహనాజ్ ఖాసీం అడ్వైజరీ జారీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీల నుంచి వచ్చిన హె చ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎక్కడైనా వీటిని గుర్తిస్తే డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించాలని, 18005996969 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించింది.