జగిత్యాల: జగిత్యాల గ్రామీణ మండలంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ (Tractor) బోల్తా పడింది. మండలంలోని జాబితాపూర్ వద్ద కూలీలతో (labourers) వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది (Overturned). దీంతో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన కూలీలను మహారాష్ట్రకు చెందిన గుహడే సంతోష్, కాలేబేబి ప్రశాంత్గా గుర్తించారు. ఈ ఘటన కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.