ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నేరడిగొండ మండలం కుప్టౌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. సిరికొండ మండలానికి చెందిన చెందిన జాదవ్ సుభాష్, జాదవ్ కిషన్ ఎడ్లను కొనుగోలు చేయడానికి టీవీఎస్ ఎక్సెల్ పై బోథ్ మండలం పొచ్చరకు వరకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో కుప్టౌ వద్ద వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.